Header Banner

ప్రపంచంలో 50 శాతం డిజిటల్‌ లావాదేవీలు యూపీఐ ద్వారానే! మూడు దేశాల పర్యటనలో..

  Mon Jun 16, 2025 15:17        Politics

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ద్వీప దేశమైన సైప్రస్ (Cyprus)కు చేరుకున్న విషయం తెలిసిందే. లిమాసోల్లో జరిగిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్లో ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ డిజిటల్ విప్లవం భారత్లో గేమ్ ఛేంజర్ నిలిచిందని.. ఆర్ధిక, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. భారత్ వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తూ.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామన్నారు. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. జీఎస్టీ (GST) అమలు, కార్పొరేట్ పన్నులకు సంబంధించిన అనేక చట్టాల్లో సంస్కరణలను 1B ప్రవేశపెడుతూ.. స్థిరమైన విధానాలను కలిగిఉండడం ద్వారా భారత్లో వ్యాపారరంగం వృద్ధి చెందుతోందని మోదీ అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఇరాన్ ట్రంప్‌ను చంపాలని చూస్తోంది.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు! హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్?

 

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, బయోటెక్, గ్రీన్ డెవలప్మెంట్ వంటి రంగాలపై దృష్టి సారించి, దేశ తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోదీ పేర్కొన్నారు. దీంతో త్వరలో భారత్ సెమీకండక్టర్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం భారత్ నౌకలు, వైమానిక రంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడంలో నమ్మకంతో పాటు వారి సౌలభ్యానికి కూడా భారత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. భారతీయ కంపెనీలు సైప్రస్ ను యూరపు ప్రవేశ ద్వారంగా చూస్తున్నాయని మోదీ అన్నారు. సైప్రసన్ను యుపీఐలో చేర్చడానికి కొనసాగుతున్న చర్చలను ప్రధాని స్వాగతించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం సైప్రస్ చేరుకున్నారు. ఆయనకు లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ సాదర స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సైప్రస్ పర్యటన అనంతరం.. ప్రధాని మోదీ కెనడా వెళ్లి అక్కడ జరగనున్న జీ7 సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్తారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #modi #50per World #Digital Transactions #India #UPI #PM MOdi #Cyprus